Ustad Bhagat Singh : ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది’ డైలాగ్ తో టీజర్ కు వ్యూవ్స్ తో కూడా పదును పెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఉస్తాద్ భగత్సింగ్’ టీజర్ ఈ రోజు (మార్చి 19) మంగళవారం సాయంత్రం రిలీజైంది. ఈ టీజర్ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబురపడుతున్నారు. తమ అభిమాన హీరోకు సంబంధించి సినిమా పరంగా చాలా రోజులుగా ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఈ టీజర్ వారికి ఆనందాన్ని ఇస్తుందనే చెప్పాలి.
గతంలో వరుస సినిమాలకు కమిట్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఒక్కో సినిమా గురించి అప్ డేట్ ఆగిపోతూ వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఓజీ’ గురించి ఒక అప్ డేట్ గతంలో వచ్చింది. అదేంటంటే రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని. ఓజీకి సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కానీ పవన్ అభిమానులు దీని కంటే ముందు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి తెలుసుకోవాలని కోరుకున్నారు. చాలా రోజులుగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ అందలేదు. దీంతో సినిమా గురించి అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్న వారి కోసం ఈ టీజర్ ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది.
2012లో ఈ కాంబోలోనే గబ్బర్ సింగ్ వచ్చి బక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అప్పటి నుంచి దాదాపు 12 ఏళ్లకు పైగా ఈ కంబో రాలేదు. ఇప్పుడు వస్తుండడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈగల్ గా వెయిట్ చేస్తుంది. ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీని ఆకట్టుకుంది.
పవర్ స్టార్ మేనరిజంతో మొదలైన టీజర్ అంతే పవర్ ఫుల్ డైలాగ్ తో కొనసాగుతుంది. విలన్ నీ రేంజ్ ఇది అని టీ గ్లాస్ కింద పడవేయగా.. ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది’ అంటూ పవన్ గాజుతో విలన్ ఫేస్ పై దాడి చేయడం కనిపిస్తుంది. ఆ తర్వాత ‘కచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం’.. అనే డైలాగ్ తో టీజర్ కు పొలిటికల్ టచ్ అద్దారు. ఈ టీజర్ లో హీరోయిన్ శ్రీలీల చిన్న సీన్ లో కనిపించి ఆకట్టుకుంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం జనసేన పార్టీకి మద్దతు పలికే పనిలో నిమగ్నమై ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త శక్తిని అందించడానికి, మేకర్స్ అతని రాజకీయ పార్టీకి పరోక్ష సూచనలతో ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ తెచ్చినట్లు తెలుస్తోంది. టీజర్ తో పొలిటికల్ టచ్ తో పాటు ఫ్యాన్స్ కు విందు తీసుకువచ్చారు పవర్ స్టార్.