మన జీవితాల్లో సెల్ ఫోన్ ఎన్నో కష్టాలు తీసుకొస్తోంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక అందరు ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారు. ఇరవై నాలుగు గంటలు ఫోన్ వాడుతూ తమ ప్రపంచంలోనే విహరిస్తున్నారు. దీంతో వారి భవిష్యత్ అంధకారంగా మారుతోంది. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు మనుషుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన భయపెడుతోంది. ఇక్కడ ఓ విద్యార్థిని రోజు సెల్ వాడుతోంది. స్కూళ్లకు సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉండి సెల్ చూస్తోంది. ఈ క్రమంలో గంటల తరబడి ఫోన్ వాడుతుంటే తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. దీంతో వ్యవహార శైలిలో మార్పు వస్తోంది. సెల్ చార్జింగ్ పెట్టినా వాడుతోంది. దీనికి పేరెంట్స్ అడ్డు చెప్పలేదు.
ఆ బాలిక సెల్ చార్జింగ్ పెట్టి ఆడుతూ ఉండటంతో అది ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న బాలిక గాయాలపాలైంది. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మరణించింది. దీంతో ఈ పాపానికి ఎవరు బాధ్యులు తల్లిదండ్రులే. ఇలా పసిమొగ్గలపై సెల్ ఎంత దారుణమైన ప్రభావం చూపుతుందో అర్థమవుతోంది. కానీ ఎవరు కూడా గుణపాఠం నేర్వలేదు.
చిన్న పిల్లలు ఏడిస్తే సెల్ ఇవ్వడం మామూలైపోయింది. ఏ చిన్న ఏడుపు మొదలు పెట్టినా వారి చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారు. దీంతో వారు సెల్ కు ఆకర్సితులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో అవి పేలుతుంటే వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. చేయని తప్పుకు బాధ్యలుగా మారుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని సెల్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలి.