రీసెంట్ గా సంపత్ రాజ్ తన ఫ్యామిలీ గురించి ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా కనిపిస్తున్న వ్యక్తి సంపత్ రాజ్. ఆయన ఈ మధ్య తీసిన వ్యవస్థ వెబ్ సిరీస్ సక్సెస్ అయ్యింది. ఇందులో ఆయన లీడ్ రోల్ పోషించారు. ఆయన గురించి తెలుసుకుందాం.. సంపత్ రాజ్ ఆంధ్రప్రదేశ్ లోని, నెల్లూరులో జన్మించారు. తమిళం, కన్నడ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ‘మాల్గుడి డేస్’లో ఏకాంబరం పాత్రను పోషించాడు. ఆ తర్వాత చాలా కాలం విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత శౌర్య (2010) కన్నడ చిత్రంతో సినిమాలో ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చాడు.
తన ఫ్యామిలీ గురించి ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చెప్పారు. తన భార్యకు విడాకులు ఇచ్చారట సంపత్ రాజ్. తనకు ఒక కూతురు కూడా ఉందని చెప్పుకచ్చాడు. పెళ్లి చేసుకొని ఒకటైన దంపతులు తమ సమస్యలను చాటవుట్ చేసుకోవాలని లేకుంటే అదే విధంగా మాట్లాడుకొని విడిపోవచ్చని చెప్పారు. తన కూతురు గురించి కూడా వివరించాడు సంపత్ రాజ్. తన కూతురు తన వద్దే ఉంటుందని. షూటింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని బోర్డింగ్ స్కూల్ లో చేర్పించినట్లు ఆయన చెప్పారు. తన భార్య ఇప్పటికీ తన ఇంటికి వస్తుందని కానీ కలిసి ఉండేందుకు కాదని చెప్పుకచ్చాడు.