![Etela Rajender](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/etela-rajender-1.webp)
Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను ఎదురు దెబ్బ తీసింది. రాబోయే ఎన్నికలకు ఇప్పుడే సవాల్ విసిరింది. బీజేపీ బలానికి బిఆర్ఎస్ అభ్యర్థులు తట్టుకోలేక ఇంటిదారి పట్టారు. కనీసం ఒక్క స్థానంలో కూడా పార్టీ జెండా ఎగురవేయలేక పోయారు. అంటే ప్రజల్లో ఆ పార్టీ ఏ మేరకు ఉందొ చెప్పాల్సిని అవసరం లేదు. గులాబీ బలహీనతలను అవకాశంగా తీసుకొని ఏకంగా ఎనిమిది స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకొంది. 2019 ఎన్నికల కంటే రెట్టింపు స్థానాల్లో 2024 ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచారు. కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టారు. మోదీ మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ లో సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి కి బెర్త్ దొరికింది.
ప్రస్తుతానికి పార్టీ రాష్ట్ర భాద్యతలు కిషన్ రెడ్డి చేతిలోనే ఉన్నాయి. ఆ భాద్యతలను తాజా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కు అప్పగించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఒకవేళ నిజమే అయితే ఈటల రాజేందర్ కు ఎందుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారు. అయన కంటే సీనియర్ నాయకులు ఉన్నారు. సంఘ్ పరివార్ నుంచి వచ్చి పార్టీ భాద్యతలు మోస్తున్న సీనియర్ నాయకులు కూడా చాలా మందే ఉన్నారు. వాళ్ళందరిని కాదని ఈటల రాజేందర్ కే పార్టీ భాద్యతలను భుజాన ఎత్తుతున్నారంటే ఆ అంతరంగం వేరే అయి ఉంటుంది. అది కేవలం భారత రాష్ట్ర సమితి పార్టీ మహా వృక్షానికి వేరు భాగం అనేది కూడా లేకుండా చేయడానికే అని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో.
ఈటల రాజేందర్ బీసీ నాయకుడు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వెంట నడిచారు. బిఆర్ఎస్ పార్టీలో అయన అనుచరులు, నమ్మకం కలిగిన నాయకులు సైతం ఉన్నారు. పరిపాలన పరంగా ఆయనకు అనుభవం ఉంది. రాష్ట్ర ఆర్థిక గణాంకాలతో పాటు, దాదాపుగా అన్ని శాఖలపై పట్టు ఉంది. కాబట్టి పార్టీ భాద్యతలు అప్పగిస్తే ఒకవైపు అధికార పార్టీని ఎండగడుతూనే , మరోవైపు బిఆర్ఎస్ కోటను కూల్చే పని సాధ్యమవుతుందనే ఈటల రాజేందర్ కు పార్టీ అధ్యక్ష భాద్యతలు అప్పగిస్తున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం.