Massive Encounter : చతిస్ గడ్ సరిహద్దుల్లో ఈరోజు భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేత లు మృతి చెందారు.
మృతుల్లో డివిసి సభ్యులు వర్గీష్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురుసం రాజు, వెంకటేష్ ఉన్నారు. వీరిపై 36 లక్షల రివార్డు ఉంది. సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గత కొద్ది రోజులుగా ఈ కమిటీ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసి నవారు వారి వివరాలు తెలిపితే 36 లక్షల రివార్డ్ ఇస్తామని కూడా పోలీసు అధికారులు తెలిపారు. ఎట్టకేలకు పోలీసులకు నలుగురు మావోయిస్టు అగ్ర నేతలు కనపడటంతో ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు.