Chattisgarh News : చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిదింది. ఇప్పటి వరకూ ఆరుగురు మావోయిస్టు మృతి చెందారు. ఇప్పటివరకు ఒక డిప్యూటీ కమాండర్ సహా ఆరు మంది నక్సలైట్లు మృతదేహాలు లభ్యమయ్యాయి.
నక్సలైట్లలో ఒక మహిళ నక్సలైట్ మృతదేహం కూడా ఉంది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలో చీపురు బట్టి ప్రాంతంలో భద్రతా బలగాలు మరియు నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది.
కోబ్రా 210,205 CRPF 229 బెటాలియన్, DRG జవాన్లు భద్రతా దళాల బృందంలో ఉన్నారు. హత మైన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.సంఘటనా స్థలంలో ఉన్న ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ మరియు కోబ్రా CRPF అధికారులు పరిస్థితిని పర్యవేక్షి స్తున్నారు.హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపారు.