పెరుగు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఒక రోజు ముందు పెరుగు పులియబెడితే అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. పెరుగు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగు తినడం వల్ల బరువు పెరుగుతారనుకునేది అపోహ మాత్రమే. పెరుగు తింటే జలుబు చేస్తుందని కూడా నమ్ముతుంటారు. ఇందులో కూడా నిజం లేదు. పెరుగు తీసుకోవడం వల్ల మనకు శక్తి పెరుగుతుంది. కానీ ఎలాంటి నష్టాలు ఉండవు.
పెరుగులో కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. పెరుగులో కొద్దిగా ఎండు ద్రాక్లలు వేసుకుని తాగితే విటమిన్ ఎ,సి,ఇ తో పాటు బి2, బి12 ఉండటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పెరుగు తినడం వల్ల వాత, కఫం రోగాలు నయమవుతాయి. అందుకే పెరుగును మన ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.
దగ్గు, జలుబు సమస్యలతో బాధపడేవారు పెరుగు తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. పెరుగులో కాస్త మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి పరిష్కారం పొందొచ్చు. మూత్రాశయ సమస్యలు, నీరసం వంటి బాధలు ఉంటే పెరుగుతో తీరుతాయి. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి తగిన శక్తి అందుతుంది.
మూత్రాశయ సమస్యలు ఉంటే పెరుగు తినడం వల్ల తక్షణమే ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. పెరుగు రోజు వారీ ఆహారంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు తీసుకుని రోగాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పెరుగును రోజు తింటూ మన ఆరోగ్య శక్తిని కాపాడుకోవాల్సి ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.