Drinking Water: మనం బతకడానికి తింటాం. కానీ కొందరు తినడానికి బతుకుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాల్సిందే. ఆహారం తినేటప్పుడు నీళ్లు తాగుతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అన్నం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. చాలా మంది తినేటప్పుడే నీళ్లు తాగుతుంటారు. కొన్ని పదార్థాలు తినేటప్పుడు నీళ్లు తాగితే నష్టాలు వస్తాయి.
అరటిపండ్లు, నారింజ, ద్రాక్ష వంటి పండ్లు తిన్న తరువాత నీళ్లు తాగకూడదు. ఒకవేళ తాగితే ఎసిడిటీ సమస్య ఎదురు కావచ్చు. పెరుగు మన జీవక్రియ మెరుగుపరుస్తుంది. పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియను మెరుగు పరిచే ప్రో బయోటిక్స్ నశించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇవి తిన్న తరువాత నీళ్లు తాగడం సురక్షితం కాదని తెలుసుకోవాలి.
స్పైసీ ఫుడ్స్ తిన్న తరువాత కూడా నీళ్లు తాగడం మంచిది కాదు. అలా చేయడం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుంది. ఇలా మనం తినేటప్పుడు నీళ్లు తాగడం వల్ల మన కడుపు లోపల జీర్ణక్రియ కోసం విడుదలయ్యే యాసిడ్ తో నీళ్లు కలవడం వల్ల జీర్ణం ఆలస్యం అవుతుంది. అందుకే తినేటప్పుడు నీళ్లు తాగడం అంత మంచిది కాదని గుర్తించాలి.
మనం తినే సమయంలో ద్రవ పదార్థాలు తీసుకోకూడదు. అన్నం తినేటప్పుడు నీళ్లు తాగడం వల్ల త్వరగా జీర్ణం కాకుండా పోతుంది. దీని వల్ల అజీర్తి సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఆహారం తింటున్నప్పుడు నీళ్లు తాగకుండా ఉండటమే శ్రేయస్కరం అని తెలుసుకుని తినేప్పుడు నీళ్లు దూరంగా ఉంచుకుంటేనే మంచిదని అవగాహన ఉంచుకోవాలి.