Soundarya, : తెలుగు సినిమా పరిశ్రమలో సావిత్రి, శ్రీదేవి తరువాత అంత అందం ఉన్న నటి సౌందర్య. సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అగ్రహీరోలందరితో నటించింది. రూ.25 వేల పారితోషికం నుంచి రూ. 50 లక్షల వరకు తీసుకుంది. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా నటించి తనకెదురు లేదని నిరూపించుకుంది.
ప్రతి ఇంట్లో సౌందర్య లాంటి అమ్మాయి ఉండాలని అందరు అనుకునే వారు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే సౌందర్య ఎప్పుడు చీర కట్టు పాత్రలే చేస్తుండేది. దీంతో ఆమె మహిళలకు కూడా ఇష్టమైన నటిగా ఉండిపోయింది. ఎన్ని సినిమాలు చేసినా అందులో తన పాత్ర మాత్రం చీరతోనే ఉండాలని షరతు పెట్టేది.
ఆమె చివరి సినిమా నర్తనశాల. రెండో షెడ్యూల్ లో ఉండగానే చనిపోయింది. గెలుపు కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమాలు ఇంటర్నెట్ లో వెతికినా దొరకవు. సౌందర్య చనిపోవడానికి ముందు తన వదితనతో మాట్లాడిన మాటలు వింటే మనకు కూడా ఏడుపు రావడం సహజం. వదినతో తనకు కాటన్ చీర, కుంకుమ కొనాలని చెప్పిందట.
బీజేపీ ప్రచారానికి వెళ్లినప్పుడు కాటన్ చీర కట్టుకుంటే బాగుంటుందని అన్నదట. కుంకుమ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అందుకే ఈ రెండు కొనాలని సూచించిందట. కానీ అవి తీసుకురాకముందే పరలోకాలకు వెళ్లింది. చివరి మాటలు విన్న వారికి కళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి. అందమైన రూపం ఉన్న వారిని దేవుడు అంత తొందరగా ఎందుకు తీసుకుపోతాడో తెలియడం లేదని అంటున్నారు.
ReplyForward
|