Karthik Subbaraju Revealed Twist : దర్శకుడు శంకర్ సమాజంలోని సమస్యలపైనే సినిమాలు తీస్తాడు. రోబో, రోబో 2 లో టెక్నాలజీతో ప్రకృతిని కాపాడాలని సందేశం ఇచ్చారు. ఇక ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రాం చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ కాగా మరోటి కమల్ హాసన్ తో ‘భారతీయుడు2’.
అయితే రాం చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’కు కథ అందించింది కార్తీక్ సుబ్బరాజు. ఈ సినిమాపై ఆయన మాట్లాడిన విషయాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఈ మూవీ పొలిటికల్ నేపథ్యంలోనే వస్తుందని ఆయన చెప్పారు.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య నటించిన ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీ ఈ వారాంతంలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో కార్తీక్ సుబ్బరాజు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’కు కథ తానే అందించినట్లు కార్తీక్ సుబ్బరాజు చెప్పారు.
‘శంకర్ సార్ నా దగ్గర ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నాయా అని అడగ్గా, పెద్ద ఎత్తున తీయాల్సిన పొలిటికల్ స్టోరీని తీశాను. బేసిక్ కాన్సెప్ట్ నచ్చి శంకర్ సర్ దాన్ని మరికొంత విస్తరించి సినిమా ప్లాన్ చేశారు’ అని కార్తీక్ సుబ్బరాజు వివరించారు.
ఆ కథను తానే డైరెక్ట్ చేయకపోవడానికి కారణం దర్శకుడు చెప్పాడు కార్తీక్ సుబ్బరాజు. ‘ఇది సూటిగా సాగే సామాజిక-రాజకీయ కథ. కాన్వాస్ చాలా పెద్దది. కథాంశానికి గణనీయమైన బడ్జెట్, పెద్ద పెద్ద స్టార్ అవసరం. ఈ చిత్రానికి శంకర్, రాం చరణ్లో సరైన కాస్టింగ్ మరియు దర్శకుడు దొరికారు’ అని ఆయన చెప్పారు.
పొలిటికల్ కథే అయినప్పటికీ సినిమా పక్కదారి పట్టలేదు. నాకున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఎన్నికల వ్యవస్థలో గణనీయమైన మార్పుల ఆవశ్యకతను చర్చిస్తుందని అన్నారు.