KCR Tension : రెండు సార్లు రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు (2023) హ్యాట్రిక్ కొట్టాలని ఉత్సాహంగా బరిలో దిగినా.. లోలోన మాత్రం టెన్షన్ పడుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల నుంచి లీకులు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందుగానే అభ్యర్థులు జాబితా ప్రకటించినా.. ఆ రెండు పార్టీల కంటే ముందుగానే ప్రచారం మొదలు పెట్టినా గులాబీ బాస్ కు ఆందోళన మాత్రం వీడడం లేదు. గజ్వేల్, కామారెడ్డి లో పోటీ చేస్తున్న ఆయన ఇటీవల గజ్వేల్ లో స్థానిక పార్టీ నాయకత్వంలో మాట్లాడుతూ ‘గజ్వేల్ ను ఎన్నటికీ మరువనని, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే కామారెడ్డి’ బరిలో నిలబడుతున్నట్లు చెప్పారు. ఈ వార్త బయటకు వచ్చే సరికి కామారెడ్డి బీఆర్ఎస్ వర్గంలో కన్ఫ్యూజన్ మొదలైంది.
ఉద్యమ సమయంలో కేసీఆర్ తో కలిసి వచ్చిన సింగరేణి కార్మికులు రెండు సార్లు కేసీఆర్ పాలనపై ఆసంతృప్తితో ఉన్నారు. దీంతో సింగరేణి ఏరియాలోని 13 నియోజకవర్గాల్లో ఓటమి తప్పదని ఇంటలీజెన్స్ సర్వేలు చెప్తుండడంతో గులాబీ బాస్ కు మరో కన్ఫ్యూజన్ మొదలైంది. గతంలో నిర్వహించిన కొన్ని ఎన్నికల్లో హస్తం పార్టీకి చెందిన కూటములు గెలుస్తూ వస్తు్న్నాయి. దీనికి తోడు ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కువ నల్లనేలపై ఫోకస్ పెట్టడంతో ఈ సారి అక్కడ బీఆర్ఎస్ ఆటలు సాగేలా కనిపించడం లేదు.
కొమ్రం భీం, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఇల్లందు, పినపాక తో పాటు మరికొన్ని సింగరేణి ఏరియాల్లో ఉన్నాయి. గతంలో వీటిలో 13 నియోజకవర్గాలను సింగరేణి కైవసం చేసుకుంది. కేసీఆర్ వ్యవహారం నచ్చకపోవడం, కవితక్క జోక్యం, ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో నల్ల నేల వాసులు బీఆర్ఎస్ బాస్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ సారి బీఆర్ఎస్ కు కలిసి రాదని, సర్వేలు కూడా చెప్తుండడంతో బాస్ కు బాధలు తప్పేలా కనిపించడం లేదు.