Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ విజయం సాధించింది. దీంతో భారత క్రికెట్ జట్టుకు ‘లక్ష్మి’ కటాక్షం లభించింది. . కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన టైటిల్ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో గెలుపొందిన భారత జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు అంటే రూ. 20.40 కోట్లు, దీంతో పాటు మెన్ ఇన్ బ్లూ అదనపు బోనస్ను కూడా గెలుచుకుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు లభించిన అతిపెద్ద ప్రైజ్ మనీ ఇదే.
భారీ భారీ ప్రైజ్ మనీ
భారీ ప్రైజ్ మనీ ప్రపంచంలో క్రికెట్కు పెరుగుతున్న ప్రజాదరణను గుర్తుచేస్తుంది. మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్లో ప్రపంచ కప్ను నిర్వహించడం ద్వారా ఐసీసీ ప్రోత్సహించినట్లయ్యింది. టీ20 ప్రపంచ కప్ 2024 మొత్తం ప్రైజ్ మనీ పూల్ $11.25 మిలియన్లు. ఇది రికార్డు. ఫైనల్లో ఓడిన సౌతాఫ్రికా జట్టుకు కూడా బాగానే లాభించింది. రన్నరప్గా నిలిచిన జట్టుకు కనీసం 1.28 మిలియన్ డాలర్లు అంటే రూ.10.67 కోట్లు, సెమీ ఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్లకు 7,87,500 డాలర్లు అంటే రూ.6.54 కోట్లు లభించాయి.
T20 ప్రపంచ కప్ 2024 పూర్తి ప్రైజ్ మనీ పూల్
విజేత- రూ. 20.40 కోట్లు
రన్నరప్ – రూ. 10.67 కోట్లు
సెమీ ఫైనల్స్లో ఓడిన జట్లు – రూ. 6.48 కోట్లు
సూపర్ 8 జట్లు – రూ. 3.16 కోట్లు
9వ-12వ జట్లు – రూ. 2 కోట్లు
13వ-20వ జట్లు – రూ. 1.87 కోట్లు
ఒక్కో మ్యాచ్ గెలిచిన బోనస్ – రూ. 26 లక్షలు
మొత్తం 20 జట్లకు ప్రైజ్ మనీ :
రెండో రౌండ్కు మించి ముందుకు సాగని జట్లకు $382,500 , 9- 12వ స్థానాల మధ్య వెనుదిరిగిన జట్లకు $247,500 లభించాయి. 13 నుంచి 20వ ర్యాంక్లో ఉన్న ప్రతి జట్టు $225,000 పొందింది. అదనంగా, సెమీ-ఫైనల్ , ఫైనల్స్ మినహా ప్రతి మ్యాచ్ గెలిచినందుకు అదనంగా $31,154 చెల్లించారు.