![](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/09/one-nation-one-election.webp)
అయితే తాజాగా తన నివేదికను ఇచ్చేందుకు లా కమిషన్ సిద్ధమవుతున్నది. జమిలి ఎన్నికలతో పాటు మరో రెండు అంశాలు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తున్నది. మాజీ రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ సారథ్యంలోని 14 మంది సభ్యుల కమిటీను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిటీ నివేదిక కీలకంగా మారింది. కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయబోతున్నదనేది చర్చనీయాంశంగా మారింది. అయితే 2024, 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం అందుతున్నది. సార్వత్రిక ఎన్నికలకు బదులు జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ప్రతిపాదించబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు షెడ్యూల్ ఎలా ఉండాలనే అంశంపై కూడా సూచనలు చేయబోతున్నది. నివేదికకు తుది మెరుగులు దిద్దిన అనంతరం కమిటీ భేటీ కాబోతున్నది. ఆ తర్వాత పూర్తి రిపోర్టును కేంద్ర న్యాయశాఖకు అందిచబోతున్నది.
ఈరోజు చైర్మన్ రితూరాజ్ అవస్థి నేతృత్వంలో కమిటీ భేటీ కాబోతున్నది. జమిలి ఎన్నికలు, పోక్సో చట్టం వయస్సు నిర్ధారణ, ఇక ఎఫ్ఐఆర్ లను తప్పనిసరిగా ఆన్ లైన్ చేసే అంశంపై నివేదికలను ఈరోజు కమిటీ ఫైనల్ చేయబోతున్నది. ఒకే దేశం ఒకే ఎన్నికలు ఆలోచనను గతంలోనే 2018 లో వేసిన జస్టిస్ బీఎస్ చౌహాన్ కమిటీ ప్రతిపాదించింది. ఇప్పుడు 22వ లా కమిషన్ కూడాదాని వైపే మొగ్గు చూపింది. 22 వ లాకమిషన్ కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రీతు రాజ్ అవస్థి నేతత్వంలో గతేడాది నవంబర్ లో కేంద్రం నియమించింది. వచ్చే ఏడాది ఆగస్టు 31వరకు ఈ కమిషన్ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో పొడగించింది. మరి ఈరోజు కమిటీ నివేదిక ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.