Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణజిల్లాలోకి నేడు ప్రవేశించనుంది. మొత్తంగా ఐదు రోజుల పాటు ఈ జిల్లాలోనే యాత్ర కొనసాగనుంది. అయితే ఈ యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో యువనే పాదయాత్ర ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పుడు ఈ పాదయాత్రలో విజయవాడ, గన్నవరంపైనే దృష్టి ఉంది. సీనియర్ నేత కేశినేని చిన్ని పాదయాత్ర బాధ్యతలు అప్పగించారు.
కాగా, వైసీపీ నుంచి పెద్ద ఎత్తు చేరికలు ఉంటాయని టాక్ వినిపిస్తున్నది. మరోవైపు పాదయాత్రలో అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే లోకేశ్ కు స్వాగతం పలుకుతూ కట్టిన తోరణాలు, ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడం వివాదాలకు కారణమైంది. ఏదేమైనా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. హమాలీ, విద్యుత్ కార్మికులతో మాట్లాడుతారు. సెంట్రల్ లో ఆటో కార్మికులు, పుస్తక పబ్లిషర్లు, ఆర్ఎంపీలతో భేటి కానున్నారు. ఆఖరి రోజు గన్నవరం నుంచి అగిరిపల్లిలోకి ఆయన ప్రవేశిస్తారు.
అయితే ఇప్పటికే గన్నవరంలో ఏదో జరగబోతున్నదనే టాక్ వినిపిస్తున్నది. వైసీపీ నుంచి కీలక నేతలు టీడీపీలోకి రానున్నారని టాక్ వినిపిస్తున్నది. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు ఇప్పటికే చంద్రబాబుతో సమావేశమయ్యారు. వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు కూడా తాజాగా తాను చంద్రబాబును కలవబోతున్నట్లు ప్రకటించారు. టికెట్ ఇస్తే గన్నవరం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఈ సారి వల్లభనేని వంశీని ఓడించాలనేది టీడీపీ ప్లాన్ రెడీ చేస్తున్నది. ఈ నేపథ్యంలో బలమైన నేత కోసం చూస్తున్నది. ఇక వైసీపీ నుంచి యార్లగడ్డ రాకతో ఆ లోటు భర్తీ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఏదేమైనా కృష్ణాజిల్లాలో లోకేశ్ పాదయాత్రతో ఫుల్ క్లారిటీ రానుంది.