MLA Maheshwar Reddy : తెలంగాణలో బీజేపీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. కడుపుబ్బా నవ్వించాయి. వీటిని బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియాలు తెగ షేర్ చేస్తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు..
‘‘రేవంత్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసరేం కాదు..మంత్రులంతా కానిస్టేబుళ్లు.. హోంగార్డులు కాదు.. ప్రభుత్వంలో అనేక మంది సీనియర్ మంత్రులున్నారు.. వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి..’’ అని సూచించారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డికి పాలనా అనుభవం లేకపోయినా సీఎం అయ్యారని, ఆయన దూకుడు తగ్గించుకుని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. గతంలో సీఎం అభ్యర్థి ఎప్పుడూ ఓడిపోలేదని.. ఒక స్థానంలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని గుర్తుచేశారు.
ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో వైరల్ గా మారాయి. ఏంటి బ్రో..ఆయన అసెంబ్లీలో ఇలా మాట్లాడారెంటీ? అనుకుంటున్నారు. పాపం ఆయన మాటలకు రేవంత్ ఏమానుకున్నాడో ఏంటో.. అని చర్చించుకుంటున్నారు.
ఏంది బ్రో అంత మాట అన్నావ్ 😂😂 pic.twitter.com/QWhnMkO6Lr
— N@V€€N (@NaveenTs24) December 16, 2023