![Yediyurappa](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-5.jpg)
Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం స్పష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. తాజాగా బెంగళూరు కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న సీఐడీ ముందు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
అయితే, యడియూరప్ప ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇలా నోటీసులపై నోటీసులు వస్తుండడం, విచారణకు హాజరైతే అరెస్టు చేస్తారనే కారణంతో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.