Afghanistan : హంబన్తోటాలో పాకిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో 202 పరుగుల ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 59 పరుగులకే ఆలౌటైంది. రెండో వన్డేలో హష్మతుల్లా షాహిదీ అండ్ కో సిరీస్ను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవడం తప్ప మరో మార్గం లేదు. టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ షాహిదీ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ జట్టుకు మంచి ఓపెనింగ్ అందించారు.
అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. చివరి రెండు ఓవర్లలో పాకిస్థాన్ గెలుపునకు 27 పరుగులు అవసరం కాగా షాదాబ్ ఖాన్, నసీంషా తమ అత్యద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని చేకూర్చారు. సమష్టి ప్రదర్శనకు తోడు నసీమ్ షా సూపర్ బ్యాటింగ్ తమ విజయానికి కారణమని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు.
టెయిలెండర్ నసీమ్ షా సంచలన బ్యాటింగ్తో పాకిస్థాన్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉడగానే కైవసం చేసుకుంది.ఈ గెలుపు తమ బ్యాటింగ్ డెప్త్కు నిదర్శనమని చెప్పాడు. ‘ఈ విజయం క్రెడిట్ తమ కుర్రాళ్లదే. ఇమామ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పేందుకు కృషి చేశాడని తెలిపారు. చివరి 10 ఓవర్లలో తమ విజయానికి 80-90 పరుగులు చేయాల్సి ఉంటుందని ముందే గ్రహించామని వెల్లడించాడు.