New Zealand Vs Pakistan : న్యూజిలాండ్, పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న టీ 20 సిరీస్ లో మూడో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పాక్ పై ఘన విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత పాకిస్థాన్ లో జరుగుతున్న ఈ సీరిస్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రావాల్పిండి లో జరిగిన మూడో టీంలో న్యూజిలాండ్ అదరగొట్టే ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లకు 178 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షాదాబ్ ఖాన్ 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరుక్ 33 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే మొదటి ఆరు ఓవర్లలో పాక్ బ్యాటర్లు బాగానే ఆడారు. కెప్టెన్ బాబర్ ఆజం, ఓపెనర్ అయూబ్ ఆరు ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. చివర్లో షాబాద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ మెరుపులతో స్కోరు 178కి చేరుకుంది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్ ఆడేందుకు ఇండియా వెళ్లగా.. ద్వితీయ శ్రేణి టీంతో ఆడుతున్న న్యూజిలాండ్ 18.1 ఓవర్లలోనే 179 పరుగుల టార్గెట్ ను ఈజీగా ఛేధించింది. సీనియర్ ప్లేయర్లు లేని లోటును కనిపించకుండా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, టిమ్ రాబిన్ సన్ నాలుగు ఓవర్లలోనే 40 పరుగులు చేసి పాక్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగారు.
పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిదీ మాత్రమే రెండు వికెట్లు తీశాడు. నహీం షా, షాహీన్ ఆఫ్రిది భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నహీం షా ఒక్కడే 44 పరుగులు ఇచ్చాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో . చాప్ మన్ 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 87 పరుగులు చేసి అలవోకగా విజయాన్ని అందించాడు. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దవగా.. రెండో టీ 20 లో పాక్ గెలిచింది. మూడో మ్యాచ్ లో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్ ను 1-1తో సమం చేసింది.