![NRIs celebrating Team India Victory](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/97f4b3c7-943e-4d34-9213-1b9513554287.jpg)
NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును దక్కించుకుంది. 17 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించింది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా శనివారం (జూన్ 29) సాగిన పోరులో సౌతాఫ్రికాతో భారత్ తలపడింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు సమర్పించుకొని 169 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో 17 సంవత్సరాల తర్వాత టీ20 వరల్డ్ కప్ భారత్ ముంగిట్లోకి వచ్చింది.
భారత్ కు టీ20 వరల్డ్ కప్ రావడంతో ఎన్ఆర్ఐలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సారి టీ20కి వేదికగా అమెరికా, బార్బాడోస్ నిలిచాయి. బార్బోడోస్ రాజధాని నగరం అయిన బ్రిడ్జ్ టౌన్ లో సౌతాఫ్రికా, భారత్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ టీ20 కప్పు గెలవడంతో అమెరికాలోని ఎన్ఆర్ఐలు సంబురాలు చేసుకున్నారు. ఎన్ఆర్ఐల్లో క్రికెట్ అభిమానులు అంతా ఒక వద్దకు చేరి ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ను తిలకించారు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ చెలరేగి ఆడడంతో ఈలలు, గోళలలో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత సౌతాఫ్రికా బ్యాటింగ్ లో వికెట్ పడినప్పుడల్లా ఈలలు, గోళలతో ఎంజాయ్ చేశారు.
చివరికి టీ20 కప్పు భారత్ గెలవడంతో వారి ఆనందం మిన్నంటింది. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. క్రికెటర్ల ఆట తీరుపై కాసేపు చర్చించుకున్నారు. కొహ్లీ టీ20కి గుడ్ బై చెప్పడంపై కొంత విచారం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మన్ వెళ్తుండడం టీమిండియా పొట్టి ఫార్మాట్ కు తీవ్ర నష్టం కలిగిస్తుందని మాట్లాడుకున్నారు. ఏది ఏమైనా ఎన్ఆర్ఐలు మాత్రం మరింత ఎంజాయ్ చేశారు.