Pakistan Team : దాయాది దేశం పాకిస్తాన్ గురించి, అక్కడి నటులు, నాయకులు, చివరికి క్రికెట్ జట్టును గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎప్పడూ వాపును చూసి బలుపులాగా భావిస్తుంటుంది బాబర్ సేన. ‘ఏ సెమీఫైనల్ చిటికెలోపని’ అని గొప్పలు చెప్పుకున్న పాకిస్తాన్ భారత్ పై అత్యంత ఘోరంగా పరాజయం పాలైంది.
భారత్ కు కొహ్లీ ఉంటే మాకు బాబర్ ఉన్నాడంటూ గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్ ఏ మ్యాచ్ ఎలా ఆడుతుందో చెప్పడం క్రీడా విశ్లేషకులకు కూడా అంతుపట్టదు. ఇక ఇప్పుడు జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో దాయాది కేప్టెన్ బాబర్ ఆజమ్ వీర ఉత్తర ప్రగల్బాలు మామూలుగా లేవు. సెమీస్ తమకు లెక్కే కాదని కప్పు కోసమే భారత్ కు వెళ్తున్నామంటూ కామెంట్లు చేశాడు.
ఇక పాక్ జట్టు విజయానికి వస్తే.. జట్టులో భారీ ట్యాలెంట్లు ఉన్న ప్లేయర్సే ఉన్నారు. కానీ సమష్టిగా ఆడడం వారికి చేతకాదు. క్రికెట్ ఎవరికి వారే ఆడుకునే గేమ్ కాదు. టీమ్ అందరూ కష్టపడితేనే, అదీ భారత్ లాంటి శక్తి వంతమైన టీమ్ ముందు మరింత కలిసి కట్టుగా ఉంటేనే గెలుపు సాధ్యం అవుతుంది.
ఫీల్డింగ్ విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటా.. చేతిలోకి వచ్చిన క్యాచ్ ను కూడా మిస్ చేస్తారు ఉత్తర కుమారులు. ప్రగల్బాలకే తప్ప పోరాటాలకు పని చేయని పాక్ జట్టు స్కాట్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ తో ఆడి గెలిచి తోపులం అంటూ విర్రవీగుతుంది. పని కూనల్లాంటి జట్లపై విర్రవీగే కేప్టెన్ మహాశయుడు బలీయమైన జట్టు ముందు ఉంటే అత్యంత ఘోరంగా ఓటమి పాలవుతున్నాడు.
ప్రస్తుతం కొనసాగుతున్న వరల్డ్ కప్ శ్రీలంక, నెదర్లాండ్స్ పై ఆడి గెలిచిన పాకిస్తాన్ ఆస్ట్రేలియా, భారత్ జట్టులతో ఆడి ఓటమి పాలైంది. ఉత్తర కుమారుడు (బాబర్ ఆజామ్) చెప్పినట్లు సెమీస్ కు చేరాలంటే మరో శక్తివంతమైన దేశం సౌతాఫ్రికాను, మరో జట్టు న్యూజిల్యాండ్ ను దాటాల్సిందే. ఏం చేస్తారో చూడాలి మరి.