BRO : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా బ్రో ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. పవన్ కల్యాణ్ అభిమానులు సందడి చేశారు. పోటాపోటీగా ప్లెక్సీలు కట్టారు. అభిమానుల మధ్య రగడకు కారణమైంది. సాధారణంగా పవన్ కల్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు. దీంతో ఆయన సినిమా వస్తుందంటే అందరిలో ఉత్కంఠ ఉండటం మామూలే.
ఇక ఫ్లెక్సీలైతే ఒకరికంటే మరొకరు పోటీగా కడతారు. మాదే నిజమైన అసోసియేషన్ అంటూ పేచీలు పెడతారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గూడూరులో రెండు ఫ్యాన్స్ అసోసియేషన్ మధ్య ఏర్పడిన తగాదా చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో థియేటర్ యాజమాన్యం కల్పించుకోవాల్సి వచ్చింది. చివరకు మళ్లీ రెండు అభిమాన సంఘాలు ఒకటి కావడంతో గొడవ దారి మళ్లింది.
యాజమాన్యానికి ఫ్యాన్స్ కు మధ్య ఫ్లెక్సీల వివాదం పెరిగింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఫ్యాన్స్ మూకుమ్మడిగా ఎదురు తిరగడంతో చేసేది లేక దిగి రావాల్సి వచ్చింది. థియేటర్ యాజమాన్యం కల్పించుకోవడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. అభిమానుల మధ్య గొడవలు వస్తే వారే తేల్చుకుంటారు. కానీ థియేటర్ యాజమాన్యం మధ్యలో దూరండంతో తగాదా యాజమాన్యానికి చిక్కుముడిగా మారింది.
ఈ నేపథ్యంలో బ్రో సినిమా ప్రదర్శనపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గూడూరు పట్టణంలోని సంగం థియేటర్ లో ప్రదర్శితమవుతున్న బ్రో సినిమా విషయంలో రెండు అభిమాన సంఘాల మధ్య గొడవకు కారణమైంది. ఫ్లెక్సీల విషయంలో రెండు వర్గాలుగా మారిపోయి గొడవకు దిగారు. థియేటర్ యాజమాన్యం మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణగడం విశేషం.