కొరియోగ్రాఫర్ చైతన్య తమ మధ్య లేడని ఊహించుకోలేకపోతున్నామని తోటి డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, యాంకర్లు అంటున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలను కొందరు వారి వారికి తెలిసిన విధంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పల్సర్ బైక్ ఝాన్సీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ పేమంట్ ఆయనకు దక్కి ఉంటే ఈ రోజు సూసైడ్ చేసుుకునే వాడు కాదని చెప్పుకచ్చారు ఆమె.
చైతన్య మరణ వార్త బుల్లితెరను ఒక్క కుదుపు కుదిపిందనే చెప్పాలి. ఆర్ధిక సమస్యలతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చైతన్య సెల్ఫీ వీడియోలో చెప్పగా.. ఒక పేమెంట్ ఆపడం వల్లే చైతన్య మరణించాడంటూ పల్సర్ బైక్ ఝాన్నీ చెప్పారు. చాలా కాలంగా చైతన్యతో కలిసి ఆమె కొరియోగ్రాఫ్ చేస్తుంది. ఐతే చైతన్య డిసెంబర్ 31 రాత్రి ఒక ఈ వెంట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయంలో నిర్వాహకులు కొంత అమౌంట్ మాట్లాడి కొందరు డ్యాన్సర్లను తీసుకురావాలని చైతన్యకు చెప్పారు.
అయితే ఆయన సెలక్ట్ చేసిన కొరియోగ్రాఫర్స్ ఆ ఈవెంట్ కు రాలేదు. వేరొకలను తీసుకువచ్చి ఆయన ఈవెంట్ ను ముగించారు. అయితే నిర్వాహకులు మాత్రం తాము చెప్పిన వారు రాలేదని సాకుగా చూపి దాదాపు రూ. 7 లక్షల వరకూ పేమెంట్ చెల్లించలేదు. దీంతో ఆయన వచ్చిన వారికి అప్పులు చేసి మరీ పేమెంట్ ఇచ్చాడు. ఇంత మంచి మనసున్న మనిషిని నేను ఇప్పటి వరకూ చూడలేదంటూ చెప్పారామే.
ఈ పేమెంట్ భారం ఎక్కువైనందుకే ఆయన ఆర్ధికంగా కుంగిపోయారు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ లో ఇంత స్ట్రగుల్ అవుతున్నారని ఎవ్వరికీ తెలియనివ్వలేదు. తెలిస్తే అందరం కూడా ఆయన వెంట నిలబడేవాళ్లం. ఆయన ఇప్పుడు మా మధ్య లేరంటేనే చాలా వెలితిగా ఉందని పల్సర్ బైక్ ఝాన్సీ చెప్పుకచ్చింది.