ఇటీవల విడుదలైన ‘రంగమార్తండ’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీనిపై చాలా మంది రివ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి విశ్లేషించారు. ఇందులో బ్రహ్మనందం యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అంటూ ఆయనకు ఫోన్ చేసి అభినందించారంట. 1250 సినిమాల్లో చూడని బ్రహ్మానందంను ఈ సినిమాలో చూశానని ఆయన చెప్పారు.
చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తండను తెరకెక్కించారు. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఈ సినిమా ఆకట్టుకోగలిగింది. ఇందులో బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అలీ, రేజాలు నటించారు. ముఖ్యంగా వీరి నటన ప్రేక్షకులకు కంటతడి పెట్టించింది. ఈ సినిమా గురించి గోపాలకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మానందం యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నాడు. బెడ్ పైన ఉండి కూడా డైలాగ్స్ చెప్పడం ఆయనకే చెల్లుతుందన్నారు. రంగమార్తాండ బ్రహ్మానందం నటన కోసమే చూడాలని కీర్తించారు. సినిమాలో ఆయన తన స్నేహితుడి వల్ల మరణించడం నచ్చలేదని చెప్పాడు. ఈ ఒక్క సన్నివేశం తనకు తీవ్రంగా నిరాశకు గురి చేసిందని వివరించాడు.
నేను చూసిన వారిలో కొందరు స్టేజీపై డైలాగ్ చెప్తూ మరణించారు. క్లైమాక్స్ లో కొన్ని మార్పులు చేస్తే మరింత బాగుండేది. సినిమాలో డైలాగులు, పాటలు, ఫైట్లు ఉండడం సాధారణమే.. కానీ ఈ మూవీలో మాత్రం జీవం ఉంది చెప్పుకచ్చారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించిన బ్రహ్మానందం ఈ సినిమాలో ఏడిపించాడని, తాను చూసిన నవరస నటులల్లో బ్రహ్మానందం అగ్రస్థానంలో ఉన్నారని అన్నారు.