![Pinnelli](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-5-1.jpg)
Pinnelli : వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన ఘర్షణలు రేపిన కలకలం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘర్షణల్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనతో సహా మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ను పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాజగా ఆదేశాలు ఇచ్చింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు మధ్యంతర బెయిల్పై విచారణ జరిపింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది కోరారు. ఘటన జరిగిన తర్వాత కుట్రపూరితంగా పిన్నెల్లి మీద కేసులు పెట్టారని న్యాయవాది వాదనలు వినిపించారు.