40.4 C
India
Thursday, May 23, 2024
More

    Rwanda Man : నరహంతకుడు…వేశ్యలే టార్గెట్..సాక్షాలు లేక బెయిల్

    Date:

    Rwanda Man :
    రువాండా దేశంలో దారుణ ఘటన వెలుగుచూసింది. రువాండా రాజధాని కిగాలీలో ఓ నరహంతకుడి దుశ్చర్యలను పోలీసులు గుర్తించారు. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ ను కిగాలీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. రువాండా రాజధాని కిగాలీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి 14 మంది వేశ్యలను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని చంపేసేవాడు. వారి ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుంటాడు. అనంతరం తన ఇంట్లోని కిచెన్్ లో ఓ గొయ్యి తీసి పాతి పెట్టాడు. ఇలా వరుసగా 14 మందిని చంపాడు. 34 ఏళ్లు ఈ సీరియల్ కిల్లర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. కిచెన్ లో తవ్వి ఉన్నట్లుగా కనిపించడంతో అనుమానం వచ్చి మొత్తం తవ్వారు. అలా 10 మృతదేహాల అవశేషాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే సదరు నిందితుడు హతమార్చిన వారి సంఖ్య 14 వరకు ఉండొచ్చని కిగాలీ పోలీసులు అనుమానిస్తున్నారు. 10 మృతదేహాలను పాతి పెట్టాడని, మిగతా వాటిని యాసిడ్ పోసి కరిగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
    రుజువులు లేక పోవడంతో న బెయిల్
    సదరు నిందితుడిని పోలీసులు దోపిడీ, అత్యాచారం, ఇతర నేరాల ఆరోపణలపై జులైలోనే  అరెస్టు చేశారు.  కచ్చితమైన సాక్ష్యాధారాలు నిరూపించడంలో పోలీసులు విఫలం కావడంతో  లఅతనికి బెయిల్ మంజూరైంది. అయితే అతని నేరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.  రెండు రోజుల క్రితం పోలీసులు అతడిని తిరిగి అరెస్టు చేయడానికి అతను అద్దెకు ఉండే ఇంటికి వెళ్లి సోదా చేశారు. ఈ క్రమంలోనే వంటగదిలో గొయ్యి తీసిన ఆనవాళ్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సీరియల్ కిల్లర్ ఒక పథకం ప్రకారం వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. వేశ్యలైతే కుటుంబాలకు దూరంగా ఉంటారని, వారి గురించి ఆరా తీసేవారు తక్కువగా ఉంటారని, స్నేహితులూ పెద్దగా ఉండరన్న ఉద్దేశంతో వారిని ఇంటికి పిలిచి హత్య చేసేవాడని పోలీసులు భావిస్తున్నారు. హత్య చేయాలని నిర్ణయించుకునే ముందు కూడా అలాంటి వారినే ఎంపిక చేసుకునేవాడట. కొందరిని తన కిచెన్ గదిలోనే పాతిపెట్టాడని, మరికొందరిని యాసిడ్ పోసి కరిగించినట్లు పోలీసుల వద్ద నిందితుడు ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఆడవారితో పాటు పురుషులు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్త్రీ, పురుష వేశ్యలను ఇంటికి పిలిచి వారిని ప్రలోభపెట్టేవాడని, ఆ తర్వాత వారి గొంతు కోసి చంపేసే వాడని పోలీసులు తెలిపారు

    Share post:

    More like this
    Related

    Dil Raju : కూతురు సినిమాపై దిల్ రాజు మౌనం.. మరీ ఇంత వివక్ష ఎందుకు బాస్

    Dil Raju : తెలుగు లో ప్రస్తుతం దిల్ రాజు సక్సెస్...

    Kidney Stones : మహిళ కిడ్నీలో 77 రాళ్లు.. తొలగించిన వైద్యులు

    Kidney Stones : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఒక...

    Kalki Event : లవ్ యూ బుజ్జి..  కల్కి ఈవెంట్ సూపరో సూపర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే

    Kalki Event : కల్కి 2898 ఏడి బుజ్జి లాంచ్ ఈవెంట్...

    Inter Supplementary Exams : రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

    Inter Supplementary Exams : రేపటి (శుక్రవారం) నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...