పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థికంగా పూర్తిగా కుదేళైన దేశం. అయినప్పటికీ భారతలాగా కుటుంబ వ్యవస్థను కల్గి ఉంది. మన దేశం కన్న కఠినమైన షరియా చట్టాలు అక్కడున్నాయి. కానీ,ఇప్పుడు అలాంటి పాకిస్థాన్ వింత పరిస్థితిని ఎదుర్కోంటోంది. కొన్నాళ్లుగా సమాధుల్లో పాతిపెట్టిన శవాలు మాయం అవుతున్నాయి. కొందరు దుర్మార్గులు అత్యంత నీచంగా శవాలను ఎత్తుకెళ్లి వాటితో సెక్సువల్ ఇంటర్ కోర్స్కు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక వినడానికే ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా ఉన్న ఈ విషయం…వాస్తవమేనని తేలింది. దీంతో చనిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల సమాధులకు బలమైన ఇనుప చువ్వలను బిగించి తాళాలు వేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం పాక్లో ఆడ పిల్లలు బ్రతికున్నప్పుడే కాదు..చనిపోయిన తర్వాత కూడా తమ పిల్లలను దుర్మార్గులు ఎక్కడ రేప్ చేస్తారోనని భయంతో చావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.