Husband : కాపురం అన్నాక దంపతుల మధ్య గొడవలు రావడం సహజం. అయితే సమస్య పరిష్కరించుకోలేని స్థితి వచ్చినప్పడు కొందరు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతుంటారు. ఆధునిక పోకడల కారణంగా ఇటీవల కొందరు చిన్న చిన్న కారణాలకే తమ వివాహ బంధాలను తెంచేసుకుంటున్నారు. చదువు లేదని కొందరైతే, ఫ్యాషన్ ఉండడం లేదని మరికొందరు ఇలా రకరకాల కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.
పెళ్లయిన మరుసటి రోజు బంధువులంతా కలిసి జరుపుకున్న వేడుకలో వధువు అడిగిన ప్రశ్నకు వరుడు సమాధానం చెప్పకోవడంతో వెంటనే అతడితో తెగదెంపులు చేసుకుంది. తన కంటే చిన్నవాడైన భర్త తమ్ముడిని పెళ్లి చేసుకొని షాక్ కు గురి చేసిందో యువతి.
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లా సైద్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నసీర్పూర్ గ్రామానికి చెందిన రామ్ అవతార్ కుమారుడు శివశంకర్(27)కు కరంద పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ పట్టి గ్రామానికి చెందిన లఖేడు రామ్ కుమార్తె రంజనతో జూన్ 11న వివాహమైంది. జూన్ 12న పెళ్లి తర్వాత వధువు ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మరదలు, మరిది శివశంకర్ని సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు.
అందులో భాగంగానే మళ్లీ దేశ ప్రధాని పేరు చెప్పాలని కోరింది. కానీ శివశంకర్ మాత్రం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పలేకపోయారు. ఈ కారణంగా, వధువు బంధువులు అతన్ని ఎగతాళి చేశారు. అతడిని అసమర్థుడిగా భావించారు. దీన్ని అవమానంగా భావించిన వధువు రంజన శివశంకర్తో తన వివాహాన్ని రద్దు చేసుకుంది. అతడి తమ్ముడు అనంత్తో అక్కడికక్కడే పెళ్లి చేసుకుంది.
మేనమామ రామ్ అవతార్ తన కోడలు తనకంటే చిన్నవాడైన అనంత్ని పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లికూతురు, చిన్న కుమారుడిని కాపురం చేసేందుకు నిరాకరించాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.