Superiority of Women Survival : స్త్రీలు ఎక్కడ పూజింప పడతారో అక్కడ దేవతలు సంచరిస్తారంటారు. ఆడవారిని గౌరవించే సంప్రదాయం మనది. అందుకే దేవుళ్లను కూడా ముందు వారి భార్యల పేర్లతోనే పిలుస్తుంటారు. పార్వతీ పరమేశ్వరులు, రాధాక్రిష్ణులు, సీతారాములు ఇలా చెబుతుంటారు. మన దేశాన్ని భరత మాత అని సంబోధిస్తాం. మనకు నీరందించే నదులన్ని ఆడవారి పేర్లే ఉంటాయి. గోదావరి, కావేరి, తుంగభద్ర, సింధు మొదలైన నదులన్ని ఆడవారి పేర్లతోనే పిలుస్తుంటాం.
మహిళను గౌరవించే సంప్రదాయం కావడంతో వారి ఔన్నత్యాన్ని గుర్తిస్తున్నాం. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లి, యవ్వనంలో భార్య, ముసలి తనంలో స్త్రీయే మగాళ్లకు అండగా ఉంటారు. అందుకే మన జీవితం సాఫీగా సాగాలంటే ఆడవారి ప్రాధాన్యం ఎంతో ఉంటుంది. ఈనేపథ్యంలో ఆడవారి ప్రాముఖ్యత గుర్తించి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తేనే మనకు శ్రీరామరక్ష.
మన హిందూ సంప్రదాయంలో ఆడవారిని ఎంతో గౌరవిస్తాం. పాశ్చాత్యులు మాత్రం ఆడవారిని గౌరవించరు. వారికి అలాంటి సంప్రదాయం లేదు. దీంతో ఆడవారిని అభిమానించడం మన పురాణాల్లో కూడా ఉంది. ఇలా మన ఆచార వ్యవహారాల్లో ఆడవారి గురించి ఎక్కడ కూడా తక్కువ చేసి చూడరు. మహిళా శక్తికి సాటిలేదు. అందుకే వారిని దేవతలకు ప్రతిరూపాలుగా చెబుతుంటారు.
స్త్రీ శక్తికి ఏదీ సాటి రాదు. వారికుండే ధైర్యమే వేరు. స్త్రీని గౌరవించని దేశం ఎదగలేదు. ఆ సమాజం నిలబడలేదు. మన సంప్రదాయంలో స్త్రీల పాత్ర ఎనలేనిది. వారితో మన దేశమే ముందుకు పోతోంది. పురుషులు స్త్రీని గౌరవించకపోతే దాని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. అందుకే వారిని గౌరవంగా భావించడం మన విధి. కర్తవ్యంగా గుర్తించాలి. అప్పుడే మన సమాజం ముందుకు వెళ్తుంది.