Smart Phone : అధిక రక్తపోటు ఈ రోజుల్లో సాధారణ సమస్యగానే మారింది. దీంతో చాలా మంది బీపీతో బాధపడుతున్నారు. ప్రతి నెల ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేసుకునే బదులు ఇంట్లోనే చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. సాంకేతికత సాయంతో స్మార్ట్ ఫోన్లోనే ఫ్లాష్ లైట్ ద్వారా బీపీని చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో బాధితుడి వేలిని కెమెరా ఫ్లాష్ వద్ద ఉంచితే చాలు బీపీ చూపిస్తుంది.
స్మార్ట్ ఫోన్ సాయంతో బీపీని మోనిటర్ చేసే క్లిప్ ని యూనివర్సిటీ ఆఫ్ కాలిపోర్నియా శాన్ డియాగో వారు కనుగొన్నారు. ఇది స్మార్ట్ ఫోన్లోని యాప్ సాయంతో పనిచేస్తుంది. దీని తయారీకి 80 సెంట్స్ ఖర్చయింది. బీపీ మోనిటరింగ్ సులభతరం చేసే పనిలో నిమగ్నం అయింది. ముసలివారు, గర్భిణులు రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బీపీ చెకప్ కోసం ప్రతిసారి క్లినిక్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
బాధితుడు ఎంత గట్టిగా నొక్కితే అంత సైజులో కెమెరాలో అంత పెద్దగా రెడ్ సర్కిల్ వస్తుంది. ఈ సమయంలో స్మార్ట్ ఫోన్ యాప్ ఈ రెడ్ సర్కిల్ నుంచి ప్రధాన సమాచారాన్ని తీసుకుంటుంది. వేలిముద్రలోకి వెల్లే రక్తం పరిమాణాన్ని కొలుస్తుంది యాప్ లోని సమాచారాన్ని డయాస్టాలిక్ రీడింగ్ లుగా మారుస్తుంది. రక్తపోటు పరికరం ద్వారా తీసుకున్న దాంతో సమానంగా వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ యాప్ అందుబాటులోకి రావడంతో బీపీ బాధితులకు మేలు జరగనుంది. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే పరీక్షలు చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దీంతో ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో బీపీ గురించి ఆందోళన చెందాల్సిన పని లేకుండా పోతుంది.