Benefits with Parijatam plant : పారిజాతం పువ్వును పూజల్లో విరివిగా వాడుతుంటాం. పారిజాత పుష్పాలు చూడటానికి అందంగా ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటికి ఉన్న విశిష్ట గుణాలతో మందుల్లో కూడా వాడతారు. మన ఆరోగ్య పరిరక్షణలో కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో పారిజాత పువ్వులు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి.
పారిజాత పుష్పాన్ని ఆంగ్లంలో నైట్ జాస్మిన్ అంటారు. పారిజాత మొక్క సముద్ర మథనంలో ఉద్భవించిందని చెబుతారు. విష్ణువు, లక్ష్మీదేవిని పూలతో పూజిస్తే వారి ఆశీర్వాదం లభిస్తుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. పారిజాత పూలతో పలు రకాల రోగాలకు చెక్ పెట్టే గుణం ఉండటంతో ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.
పారిజాతం పువ్వులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. గొంతు వాపుకు చెక్ పెడుతుంది. గొంతు కండరాలను మృదువుగా ఉంచుతుంది. జ్వరం తగ్గించి శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి తోడ్పడుతుంది. పారిజాత ఆకులను మెత్తగా నూరి తినడం వల్ల మలేరియా జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పువ్వు ఎంతో సాయపడుతుంది.
ఒత్తిడి, ఆందోళనలను దూరం చేయడంలో పారిజాతం నూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. చర్మ సమస్యలు రాకుండా చేయడంలో పారిజాతం మొక్క దోహదపడుతుంది. వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేస్తుంది. దీని ఆకులను కషాయంగా చేసుకుని తాగితే కీళ్ల నొప్పులు మాయమవుతాయి. అందుకే ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు.