TDP Future Guarantee : ఏపీలో తెలుగు దేశం పార్టీ కొన్ని రోజులుగా భవిష్యత్ గ్యారెంటీ అంటూ ప్రజల ముందుకెళ్తున్నది. వినూత్న పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నిస్తున్నది. పేద, మధ్య తరగతి వర్గాలే టార్గెట్ ప్రచారం చేస్తున్న ఈ పథకాలకు విశేష ఆదరణ దక్కుతున్నది.
ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత పథకం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ మంచి నీరు, పేదల ఆదాయం రెట్టింపు, యువగళం నిధి లాంటి పథకాలు భవిష్యత్ గ్యారెంటీగా టీడీపీ చెబుతున్నది.
ఇక ఆడబిడ్డ నిధి కింద 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 అందించబోతున్నది. తల్లికి వందనం పథకం కింద పిల్లల చదువులకు రూ. 15 వేలు, దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించనున్నది. ఇక మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని హామీ ఇస్తున్నది, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. 3000 భృతి కింద ఇవ్వబోతున్నది. దీంతో పాటు ఏపీలోని ప్రతిరైతుకు ఏడాదికి రూ. 20వేలు సాయంగా అందించనున్నది. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్, పేదలను సంపన్నులను చేసేలా వివిధ పథకాలను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నది.
ప్రస్తుతం ఈ హామీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఎన్నికలకు ముందు మరిన్ని పథకాలను మ్యానిఫెస్టోలో చేర్చేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఈ పథకాల వివరాలను టీడీపీ శ్రేణులు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో పార్టీని మరోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా టీడీపీ హామీనిచ్చిన ఈ పథకాలు పేద,మధ్య తరగతివర్గాల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి.