![Sharad Pawar](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-16-5.jpg)
Sharad Pawar : ప్రధాని మోదీకి శరద్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమికి మద్దతిచ్చినందుకు ప్రజలకు తమ కృతజ్ఞతలు తెలుపడానికి ఎన్సీపీ నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, పృథ్వీరాజ్ చవాన్ శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ ‘‘ప్రధాన మంత్రి రోడ్ షోలు నిర్వహించిన ప్రతిచోటా మేము గెలిచాం. అందుకే ప్రజలతో పాటు ప్రధాని మోదీకి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
శివసేన, ఎన్సీపీలో చీలికలు వచ్చిన అనంతరం అజిత్ పవార్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జట్టు కట్టింది. కాబట్టి తమ నుంచి విడిపోయిన ఆయన బంధువు అజిత్ పవార్ ను తిరిగి తన పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని శరద్ పవార్ వెల్లడించారు.