![Jai Chandranna](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-2.jpg)
Jai Chandranna : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళగిరిలోని పెనుమాక గ్రామంలో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి రూ. 7 వేలు అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు చాలా సంతోషపడుతున్నారు.
తాజాగా, రూ.7 వేలు తీసుకున్న ఓ లబ్దిదారుడు పట్టరాని ఆనందంతో రోడ్డుపై చిందులు వేశాడు. జై చంద్రన్న అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశాడు. డబ్బలు లెక్కపెడుతూ, నినాదాలు చేస్తూ డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.