CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మెడీ డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేయనున్నారు. దాదాపు 13 వేల ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల నగదు పెంపు, అన్న క్యాంటీన్లు, నైపుణ్య గణనపై సంతకాలు చేస్తారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులతో ప్రమాణస్వీకారం చేయించారు. బాధ్యతలు చేపట్టిందే తడవుగా పరిపాలనపై దృష్టి పెట్టడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.