‘విజయ్ దేవరకొండతో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. ఇద్దరం మంచి స్నేహితులం. ఆయన హీరోగా చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో కొన్ని డైలాగులను సెన్సార్ బోర్డ్ మ్యూట్ లో పెట్టింది. ఈ సినిమా విడుదలైనప్పుడు థియేటర్లలో విజిట్ కు వెళ్లిన విజయ్ దేవరకొండ ఆడియన్స్ తో ఆ పదాలను పలికించాడు. ఒక తల్లిగా ఆ పదాలు నన్నెంతో బాధపెట్టాయి. ఇలాంటివి ప్రోత్సహించవద్దని ఆయనతో నేను చెప్పాను. ఇక అప్పటి నుంచి నాపై ఆన్ లైన్ ట్రోల్స్ మొదలయ్యాయి. కొంత కాలం చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత తేరుకున్న తనకు విజయ్ నిర్మించిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’లో అవకాశం వచ్చింది. అందులో నటించాను. అయితే, విజయ్ కు సంబంధించిన వ్యక్తే తనను ట్రోల్ చేసేందుకు కొందరికి డబ్బులు ఇస్తున్నాడని తెలిసి షాక్ కు గురయ్యాను. ఇదంతా విజయ్ కు తెలియకుండానే జరుగుతుందా.? అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో లేదో తెలియదు కానీ, ఈ వార్ ను ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నా’ అని ఆమె చెప్పారు.
అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతుంది. అందుకే ఆమె తరుచూ విజయ్ ను ఉద్దేశించి పోస్ట్ లు పెడుతుంది. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ ఈ సినిమా పోస్టర్ పై ‘ది విజయ్ దేవరకొండ’ అని ఉండడాన్ని ఆమె తప్పుబట్టారు. దీనిపై ఆమె వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయను ట్రోల్ చేశారు.
ReplyForward
|