Vijayasai Reddy :
ఏ మాత్రం అవకాశం వచ్చినా టీడీపీని, చంద్రబాబు, నారా లోకేష్ పై చెలరేగిపోతుంటారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తరచూ ట్విట్టర్ లో చెలరేగిపోతుంటారు. ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఢిల్లీ పెద్దలకూ అర్థమయ్యేలా హిందీ, ఇంగ్లీషులో.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను విమర్శించేందుకు తెలుగులో ట్వీట్ చేయడం విజయసాయి రెడ్డి పని. టిడిపి, జనసేనలను విమర్శిస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. కానీ అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తమ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నా, విజయసాయి రెడ్డి మాత్రం ట్విట్టర్లో మోడీ భజన చేస్తున్నాడు. దీని వలన వ్యక్తిగతంగా ఆయన, రాజకీయంగా వైసీపీకి లబ్ది చేకూర్చుతూనే బీజీపీ ఆశలపై నీళ్లు చల్లతున్నారు. రాష్ర్ట విభజన హామీలు నెరవేర్చడం లేదని ఏపీ ప్రజలు బీజేపీపై మండిపడుతున్నారు.
ఏ మాత్రం అవకాశం వచ్చినా టీడీపీని, చంద్రబాబు, నారా లోకేష్ పై చెలరేగిపోతుంటారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తరచూ ట్విట్టర్ లో చెలరేగిపోతుంటారు. ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఢిల్లీ పెద్దలకూ అర్థమయ్యేలా హిందీ, ఇంగ్లీషులో.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను విమర్శించేందుకు తెలుగులో ట్వీట్ చేయడం విజయసాయి రెడ్డి పని. టిడిపి, జనసేనలను విమర్శిస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. కానీ అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తమ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నా, విజయసాయి రెడ్డి మాత్రం ట్విట్టర్లో మోడీ భజన చేస్తున్నాడు. దీని వలన వ్యక్తిగతంగా ఆయన, రాజకీయంగా వైసీపీకి లబ్ది చేకూర్చుతూనే బీజీపీ ఆశలపై నీళ్లు చల్లతున్నారు. రాష్ర్ట విభజన హామీలు నెరవేర్చడం లేదని ఏపీ ప్రజలు బీజేపీపై మండిపడుతున్నారు.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీతో లోపాయికారి స్నేహం చేస్తున్నదని ప్రజలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. విజయసాయి రెడ్డి కేంద్రాన్ని పొగుడుతూ పెడుతున్న ట్వీట్స్ ప్రజల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నది. బీజేపీ అధ్యక్షుడిని మార్చి పురందేశ్వరిని నియమించినా, ఆమె జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నా, ఏపీ బీజేపీ విశ్వసనీయత ప్రశ్నార్ధకంగానే ఉంటుందన్న మాట! ఇక ఈ విజయసాయి రెడ్డి ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని ట్విట్టర్లో ఈ మధ్య విమర్శలు మరింత గుప్పిస్తున్నారు. తాజాగా ఆయా ఓ కొత్త విషయం కనిపెట్టి చెప్పారు. “యువగళం, ప్రాజెక్టుల యాత్ర పేరుతో తండ్రీకొడుకులు తిరిగిన ప్రతి నియోజకవర్గంలో డిపాజిట్ గల్లంతవడం ఖాయమని, రాజకీయాలకు చీడపురుగులై, వీళ్ల నోటి దురుసుతనం, అరాచకాలు, హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బాకా మీడియా పబ్లిసిటీ తప్ప ప్రయోజనం లేదని తేలిపోయింది,” అని ట్వీట్ చేశారు. టీడీపీకి డిపాజిట్లు దక్కవని ఆయన ఏ ప్రాతిపదికన ఓ నిర్ణయానికి వచ్చారో తెలియదు కానీ, టీడీపీ దారుణంగా ఓడిపోతుందని వైసీపీ నేతలు నమ్మితే వారికి సంతోషంగా ఉండవచ్చు కదా.. కానీ నిత్యం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లపై విమర్శల భజన ఎందుకు చేస్తున్నారు?ఓటర్ల జాబితాలు తారుమారు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు ఏపీలో వెల్లువెత్తుతున్నాయి.
ReplyForward
|