Morning Tips:
మనలో చాలా మంది ఉదయం లేవగానే నీళ్లు తాగుతుంటాం. కానీ కొందరు మాత్రం నోరు శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగడం మంచిది కాదని చెబుతుంటారు. ఇందులో వాస్తవం లేదు. తెల్లవారు జామున నిద్ర నుంచి మేల్కోగానే పరిగడుపున మనం తాగే నీళ్లు మనకు పరమ ఔషధంగా పనిచేస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో కొందరు పళ్లు తోముకుని తాగాలని బావిస్తుంటారు.
ఈ నేపథ్యంలో మనం ఉదయం సమయంలో తాగే నీటితో మనకు చాలా రకాల ప్రయోజనాలున్నాయి. దీని వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలా రకాల రోగాలకు ఇది చెక్ పెడుతుంది. ఇంకా గోరువెచ్చని నీరు తాగడం వల్ల చాలా మంచి లాభాలు కలుగుతాయి. ఈ విషయం తెలుసుకుని ప్రవర్తిస్తే మన ఆరోగ్యం నిలకడగా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన మెరిసే చర్మం పొందడంలో నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఊబకాయం సమస్య నుంచి దూరం కావచ్చు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం పరిగడుపున నీళ్లు తాగితే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
నోటిలో చెడు బ్యాక్టీరియా చేరకుండా చేస్తుంది. నోటిలో లాలాజలం కలగడం వల్ల నోరు పూర్తిగా పొడిబారకుండా చేస్తుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఉయం పూట నీళ్లు తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇలా పరిగడుపున నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు.