Marriage : హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ భార్య తన భర్తకు దగ్గరుండి పెళ్లి చేసింది. తమ పెళ్లి విషయాన్ని దాచి మరో యువతితో భర్తకు పెళ్లి చేసింది. ఆ తర్వాత బాధిత యువతికి విషయం తెలియటంతో సీన్ రివర్స్ అయింది. పోలీసులు భర్తతో పాటు మెుదటి భార్యపై కేసులు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ లోని సింగాడి కుంట బస్తీకి చెందిన ఓ యువతి (20) నగరంలో హోం ట్యూటర్గా పనిచేస్తున్నది. 2020లో యూసుఫ్గూడలోని డ్యాన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొనేందుకు వెళ్లిన సమయంలో అక్కడ గాంధీ (23) అనే యువకుడితో ఏరపడిని పరిచయం ప్రేమగా మారింది. ఇరువర్గాల పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వారిద్దరూ కొద్ది రోజులు సహజీవనం చేశారు.
అయితే గాంధీకి అంతకు ముందే మరో అమ్మాయితో పరిచయం ఉందని, ఆమెను ప్రేమించాడని యువతికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత పంచాయితీ పోలీసు స్టేషన్కు వెళ్లింది. రోజాను స్టేషన్కు పిలిపించారు. గాంధీ, తాను మంచి స్నేహితులమని తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని రోజా పోలీసుల ముందు చెప్పింది. దీంతో ఇరు కుటుంబాలు రాజీకా వచ్చాయి. మే 14న గాంధీకి, యువతికి పెళ్లి చేయాలని ముహూర్తం నిర్ణయంచారు.
రోజా దగ్గరుండి గాంధీకి మరో యువతితో వివాహం చేయించింది. కొద్ది రోజుల తర్వాత గాంధీ ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో భార్య ప్రశ్నించింది. దీంతో ఆమెను వేధింపులకు గురి చేశారు. గాంధీ, రోజా ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని యువతి తెలుసుకొంది. వారి పెళ్లి విషయాన్ని దాచి రోజా దగ్గరుండి తమ పెళ్లి చేసిందన్న విషయం ఆమెకు తెలిసింది.
సదరు బాధిత యువతి ఆవేదనకు లోనై బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఇంట్లో ఉండగా.. అక్కడకు రోజా వచ్చింది. తన స్నేహితులైన సుజ్జి, సంజీవ్, విజయ్, అనంత, జెస్సికాలతో వచ్చి న్యాయం చేయాలంటూ గొడవకు దిగింది. ఆ సమయంలో గాంధీ ఇంట్లో లేడు. తనను మోసం చేయటంతో పాటు ఇంటికి వచ్చి గొడవ చేసినందుకు బాధిత యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గాంధీ, రోజాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.