ఆంధ్రప్రదేశ్ లో పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ వివాహ నమోదు ఫీజు రూ.200 ఉండగా రూ. 500కు పెంచింది. వివాహ వేదిక వద్దకే సబ్ రిజిస్టార్ వస్తే ఫీజులు రూ.5000 (గతంలో రూ.210) చేసింది. ప్రభుత్వ సెలవు రోజుల్లో వివాహాల నమోదు ఫీజులు రూ.5000గా నిర్ధారించింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రికార్డు పరిశీలనకు రూపాయి నుంచి రూ. 100 కు పెంచింది.