ముఖ్యమంత్రి కేసీఆర్పై విపక్షాలు వ్యంగ్యంగా సెటైర్లు మొదలెట్టాయి. కొత్త సచివాలయం కట్టినందున ఇప్పటికైనా ఆయన సెక్రెటెరియట్కు వస్తారా..? అని ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్, ఆపార్టీ స్టార్ క్యాంపెయినర్,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డైతే కేసీఆర్కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. నూతన సచివాలయాన్నికట్టుకున్నారు. ఆయన ఇప్పటికైనా ప్రతీ రోజు సచివాయంలో అడుగుపెడతారా..? అని ప్రశ్నించారు. కొత్త కట్టుకున్న సెక్రటెరియట్కు వచ్చి పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేస్తారని ఆశీస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్పై సెటైర్లు వేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేది నాలుగైదు నెలలే కాలం కాబట్టి ఆయన నూతన సచివాలయం కట్టుకొని సంతోషపడడంలో తప్పులేదన్నారు. అయితే ఐదు నెలల తర్వాత మాత్రం ఆయనకు సచివాలయంలో అడుగు పెట్టేందుకు చాన్సుండదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగోలా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందువల్ల ఆయన ఇప్పటి నుంచే ఎక్కడో కూర్చుంటారో ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు. ఆయనకు ఆలోచన రాకపోతే నేనే చెబుతానన్నారు. పవర్ కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఫాంహౌజ్లోనే తన టికానను పెట్టుకుంటే బాగుంటుందని హేద్దేవా చేశారు.
ఇక సీఎం కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ..ఈ తొమ్మిదేళ్ల పాలనా కాలంలో ఎప్పుడు కూడా పెద్దగా సచివాలయానికి వెళ్లిన సందర్భాలు లేవు. ఎక్కువ టైం ప్రగతి భవన్, ఎర్రవల్లి ఫాంహౌజ్కే పరిమితమయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఫైల్స్ పెండింగ్లోనే ఉండిపోయాయి. విపక్షాలు ఎన్నిసార్లు ఆయనపై విమర్శలు చేసినా..పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి..ఇటు బీజేపీ తరపున ఆపార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.