YSRTP Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైయస్సార్ తెలంగాణ పార్టీ నేతలతో వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. YSRTP పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు వైయస్ షర్మిల పార్టీ నేతలకు తెలియజేశారు. జనవరి 4 వ తేదీన పార్టీ ని విలీ నం చేస్తున్నట్లు నేతలకి స్పష్టం చేశారు. రేపు సాయంత్రం ఢిల్లీ కి పయనం అవుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన ప్రకారం వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నిక ల్లో పోటీ చేయలేదు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతల కు వైఎస్ ఆర్టీపీ మద్దతు ప్రకటిం చింది. మధు తెలిపిన ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్ళింది. అనుకున్న విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు వైఎస్ షర్మిల కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పోస్ట్ ఇస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఏదైనా పదవి ఇస్తారా లేక ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి క్రియాశీలకంగా దింపుతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద షర్మిల ఢిల్లీ టూర్ తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.