అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా ఆ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంచలన సంఘటన చికాగో సమీపంలోని అలెగ్జాoడర్ కౌంటీ వద్ద జరిగింది. గురువారం తెల్లవారు ఝామున 4.15 ఈ రోడ్డు ప్రమాదం జరిగింది . పిక్నిక్ కు ఒక కారులో అయిదుగురు స్నేహితులు బయలుదేరారు. తెల్లవారు ఝాము కావడంతో కాస్త వేగంగా వెళ్తున్నారు.
ఇక అంతకంటే వేగంగా ఎదురుగా మరో కారు వచ్చి బలంగా ఢీకొట్టడంతో భారీ యాక్సిడెంట్ అయ్యింది. దాంతో అక్కడికక్కడే పీచెట్టి వంశీకృష్ణ (23) , స్వర్ణ పవన్ (23) చనిపోయారు. ఇక ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు స్నేహితులు కళ్యాణ్ , కార్తీక్ , శ్రీకాంత్ లకు గాయాలు అయ్యాయి. దాంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు హైదరాబాద్ లోని నిజాం పేట కు చెందిన వాళ్ళు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.