చెల్లి ఎమ్మెల్సీ కవిత కోసం అన్న మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో తనకు అండగా ఉండాలని భావించిన కేటీఆర్ నిన్న ఢిల్లీ వెళ్ళాడు. ఈరోజు , రేపు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నాడు కేటీఆర్. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనుంది కవిత.
అయితే కవితను ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేయడం ఖాయమని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో కవిత తీవ్ర ఆందోళనకు లోనయ్యిందట. తనకు వచ్చిన కష్టాలు చూసి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతటి నాయకులైనా సరే వాళ్ళు కూడా మానవ మాత్రులే కదా ! సహజంగానే ఉద్వేగాలు ఉంటాయి. దాంతో మానసిక ఆందోళనకు గురౌతున్న తన చెల్లిని ఓదార్చడానికి అన్న కేటీఆర్ ఢిల్లీ వెళ్ళాడు. అన్నగా అండగా ఉంటానని భరోసా కల్పించాడట.
అంతేకాదు పలువురు లాయర్లతో పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుపుతున్నాడట. ఈడీ పెట్టిన కేసులో ఎలాంటి లొసుగులు ఉన్నాయి. వేటి ద్వారా కవితను అరెస్ట్ కాకుండా చూసుకోవచ్చు. ఈ కేసు నుండి ఆమెను ఎలా బయటకు తీసుకురావాలి అని అన్ని అంశాల మీద చర్చిస్తున్నాడట. పలువురు లాయర్లు ఈ ఈకేసులో ఉన్న లొసుగులు కేటీఆర్ కు వివరిస్తున్నారు. అయితే లాయర్లు చెప్పేవి ఈడీ ముందు , కోర్టు ముందు పని చేస్తాయా ? లేదా ? అన్నది పక్కన పెడితే ఆమెకు భరోసా కల్పించడానికి మాత్రం పెద్ద ఎత్తున ప్రయత్నాలే చేస్తున్నాడు కేటీఆర్.