నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి 130 కోట్ల క్లబ్ లో చేరింది. జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన వీరసింహారెడ్డికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. అయితే ఆ మరుసటి రోజు చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య విడుదల కావడంతో కొన్ని థియేటర్ల నుండి వీరసింహారెడ్డి చిత్రాన్ని తీసేసారు. ఇక ఆ మరుసటి రోజున విజయ్ వారసుడు విడుదల కావడంతో మరికొన్ని థియేటర్ల నుండి తీసేసారు దాంతో బాలయ్య చిత్రానికి చాలా చాలా తక్కువ థియేటర్లు ఉన్నాయి. దాని వల్ల వసూళ్లు మందగించాయి.
మొదటి రోజున 54 కోట్ల వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా వసూల్ చేసిన వీరసింహారెడ్డి రెండో రోజు నుండి జోరు తగ్గిపోయింది. దాంతో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దాదాపు 74 కోట్ల షేర్ వసూల్ అయ్యింది. ఇక బ్రేక్ ఈవెన్ కు కేవలం ఒక కోటి రూపాయలు వస్తే చాలు……. వీరసింహారెడ్డి చిత్రాన్ని కొన్న బయ్యర్లంతా లాభాల్లోకి వస్తారు. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేదు కాబట్టి వీరసింహారెడ్డి మరో 10 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం ఖాయమని భావిస్తున్నారు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన విషయం తెలిసిందే. తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఇక నటన పరంగా బాలయ్య అదరగొట్టాడు. బాలయ్య గెటప్ , డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ , దునియా విజయ్ లకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభించడంతో తమ సత్తా చాటారు. శృతి హాసన్ పాత్ర నిడివి తక్కువే అయితే గ్లామర్ తో అలరించింది.