న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఇది నానికి మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో షూటింగ్ మొత్తం జరిగింది. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.
నాని లుక్కుకు అలాగే పాటలకు , టీజర్ , ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నాని , కీర్తి సురేష్ అయితే ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు ఫలిస్తాయా ? లేదా ? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు వేస్తున్నారు. దాంతో టాక్ ఏంటి ? అన్నది తెల్లవారే సరికి తెలియనుంది.
సెన్సార్ రిపోర్ట్ ప్రకారం అయితే దసరా గట్టిగానే కొట్టేట్లు కనబడుతోంది. ఇక ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండనుంది అనేది మాత్రం రేపు తెలియనుంది. పాటలు బాగున్నాయి , యాక్షన్ అదిరింది ….. ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నమాటే !.