![curd](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/05/curd.jpg)
curd : మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. తినే ఆహారాల విషయంలో ఎలాంటి పనులు చేయాలనే దానిపై తగిన శ్రద్ధ తీసుకోవడం సహజం. ఈనేపథ్యంలో పెరుగు తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలంలో శరీరంలో వేడిని తగ్గించుకునేందుకు పెరుగును తాగుతుండాలి. అన్నంలో కలుపుకుని తింటే ఎంతో మంచిది.
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది. మూత్రాశయ సమస్యలు తొలగించడానికి దోహదపడుతుంది. పెరుగుకంటే మజ్జిగ చాలా మంచిది. పెరుగును ఒక రోజు పులియబెట్టడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. తద్వారా మనకు రోగాలు లేకుండా చేస్తుంది. పెరుగు తినడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో కొంచెం వాము కలుపుకుని తింటే దంత సమస్యలు దూరమవుతాయి. పళ్లనొప్పి, ఇతర సమస్యలు దూరం కావడానికి తోడ్పడుతుంది. పెరుగులో నల్ల మిరియాల పొడి కలుపుకుని తింటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇలా పెరుగును వాడుకుంటే మనకు మంచి లాభాలు కలుగుతాయి. పెరుగు తినడం వల్ల ఎండాకాలంలో ఎంతో ప్రయోజనం వస్తుంది.
బరువు తగ్గడానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో కొద్దిగా జీలకర్ర వేసుకుని తినడం వల్ల అధిక బరువు సమస్య నుంచి దూరం కావొచ్చు. పెరుగుతో కొన్ని రకాల పండ్లు కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల కూడా మన ఆరోగ్యం బాగుంటుంది. ఇలా పెరుగును వాడుకుని చాలా రకాల రోగాలకు చెక్ పెట్టే విధంగా సాయపడుతుంది. ఇలా పెరుగును వాడుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.