Assam CM : ఇండియా పేరును ‘భారత్’గా మార్చనున్నారని కొన్ని రోజులుగా దేశం యావత్తు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ఈ పేరు మార్పుపై సటైర్లు వేస్తున్నారు. ఇండియా పేరు మార్చడం లేదని రాజ్యంగంలో చెప్పిన దాని ప్రకారమే ఇండియాను భారత్ గా కూడా పిలవవచ్చని చెప్తున్నారు. ఇందులో మార్పు అనేది లేదని చెప్తున్నారు.
మూడు రోజుల కింద (సెప్టెంబర్ 9, 10) G20 సమ్మిట్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ నేమ్ ప్లేట్ పై ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉంది. దీనికి తోడు రాష్ట్రపతి ఇచ్చే విందులో ‘భారత్ రాష్ట్రపతి’ అని ముద్రించబడి ఉంది. ఈ కారణాలతో దేశం పేరు మారుతుందని వాదనలు మొదలయ్యాయి. దీనిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ దేశం పేరు మార్చడాన్ని గాంధీ కుటుంబానికి జత చేసి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.
దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన జాతిపిత ఒక్కరే ‘గాంధీ’ మహాత్ముడు అని ఇందిరా కుటుంబం డూప్లికేట్ గాంధీలని అభివర్ణించాడు. రాజ్యాంగంలో ఉన్న పేరునే పలుకుతుంటే ఉలిక్కి పడుతున్న కాంగ్రెస్ నాయకులు ఏ హక్కుతో గాంధీని తగిలించుకున్నారని ప్రశ్నించారు. ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్, ప్రియాంక ఏ ఫార్ములా ద్వారా గాంధీగా మారారు? అంటూ నిలదీశాడు.
ఈ విషయం తెలుసుకునేందుకు నేను చాలా కాలం పరిశోధనలు చేశారని బిస్వ శర్మ అన్నారు. ఇప్పటికీ నాకు సమాధానం దొరకలేదన్నారు. ఇందులో మన దేశ దురదృష్ణం ఏంటంటే. భారత దేశానికి సంబంధించిన మొదటి స్కామ్ ఆ కుటుంబం నుంచే జరిగింది. కానీ స్కామ్ చేసిన వ్యక్తికి గాంధీ పేరు ఉండడం నన్ను చాలా బాధకు గురి చేసిందని అన్నారు. జాతిపిత పేరుకు స్కామ్ మరక అంటించారని మండిపడ్డారు.