Nilgiri Hills : వాతావరణంలో మార్పులు శరవేగంగా వస్తున్నాయి. తమిళనాడు ఊటీగా పేరుగాంచిన నీలగిరి కొండల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. దీంతో జనం అల్లాడుతున్నారు. చీకటైందంటే చాలు చలి మంటలు వేసుకుంటున్నారు. మంటల చుట్టే కూర్చుకుంటున్నారు. కాంతల్, తలైకుంట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. బొటానికల్ గార్డెన్ లో 2 డిగ్రీల సెల్సియస్, శాండినాల్లాలో 3డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది.
వాతావరణంలో ఇలా మార్పులు రావడానికి గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో ప్రభావం వస్తున్నట్లు తెలుస్తోంది. నీలగిరి ఎన్విరోమెంట్ సోషల్ ట్రస్ట్ కు చెందిన శివదాస్ చలితీవ్రత మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధ్యయనాలు కూడా కొనసాగుతున్నాయి. డిసెంబర్ లో కురిసిన వర్షాల ప్రభావంతోనే చలి తీవ్రత పెరిగినట్లు భావిస్తున్నారు. దీని వల్ల పంటలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు.
ఉదయం సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నీలగిరి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. వాతావరణ మార్పులపై పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత ఇంత భారీగా పెరగడం వల్ల వారికి ఏం చేయాలో తోచడం లేదు.
గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో మార్పులు రావడం వల్ల రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చలి నుంచి కాపాడుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు. మంచుతో కప్పబడి ఉంటున్నాయి. తేయాకు తోటలకు నష్టం కలుగుతోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.