Telangana Formation Day Celebrations : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. గవర్నర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సీఎస్ శాంతికుమారి తదితరులు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కళాకారులు, తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పేలా 17 కళలను ప్రదర్శించారు.
జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్ వాక్ ఆకట్టుకుంది. ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలి రావడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. వేడుకలు జరుగుతున్న సమయంలో వర్షం పడడంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది.
Breaking News