Indian Overseas Congress USA : అమెరికా, న్యూజెర్సీలో కాంగ్రెస్, మిత్ర పక్షాల విజయంతో సంబురాలు చేసుకున్నారు. గ్రాండ్ బల్రోమ్ లోని రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో బుధవారం (జూన్ 19) రోజున సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫ్ యూఎస్ఏ తో కలిసి న్యూజెర్సీ శాఖతో పాటు అన్ని శాఖలు నిర్వహించిన సంబురాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇండియా కూటమి మద్దతు దారులు పాల్గొన్నారు. గతం (2019) కంటే ఈ సారి (2024) కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు పెరగడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంబురాలకు ఇండియా నుంచి ప్రముఖులు హాజరయ్యారు. పార్టీ పెద్దలతో పాటు అమెరికాలోని కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేవారు పాల్గొన్నారు.
ప్రముఖులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం ఎవరితరం కాదన్నారు. పార్టీ పుట్టినప్పుడు ఇప్పుడున్న ఇతర పార్టీ నాయకులు పుట్టలేదన్నారు. ఏదో ఒకసారి వెనుకడుగు వేసినంత మాత్రాన వెనకే ఉండిపోతాం అనడం సరికాదని అందుకు ఇప్పటి ఫలితాలే నిదర్శనం అన్నారు. గతంలో 47 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు 99కి చేరిందని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో లైవ్ ఇండియన్ మ్యూజిక్ తో పాటు డిన్నర్, డ్యాన్స్ నిర్వహించారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు (జూన్ 19) సందర్భంగా కేక్ కట్ చేశారు. ఇందులో ఇండియా నుంచి శ్యామ్ పిట్రోడా, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మహీంద్రసింగ్ గిల్జన్, ప్రదీప్ శ్యామలతో పాటు హర్కేష్ ఠాకుర్, ప్రదీప్ (పీటర్) కొటారి, రామ్ గాడులా, గుర్మీత్ సింగ్ గిల్, రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ముఖేశ్, ముసుమి, రాజ్, అర్జుమన్ జువేరియా, దీపక్ వల్ సోదా.. కూడా పాల్గొన్నారు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya tV & JSW Tv Global Director)
More Images : Celebrating Rahul Gandhi’s Birthday & Victory of Congress